పూణెలో ఓ మైనర్ మద్యం మత్తులో విలాసవంతమైన పోర్షే కారును నిర్లక్ష్యంగా నడపడంతో ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందారు. ఈ ఘటనపై ఎన్సీపీ-ఎస్సీపీ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. పూణెలో మైనర్కు మద్యం సరఫరా చేసి మద్యం తాగి వాహనం నడపడం వల్ల ఘోర ప్రమాదం జరిగిందని తెలిపారు. డ్రగ్స్ పట్టుబడుతున్నా, మైనర్లకు మద్యం సరఫరా చేస్తుంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతున్నా మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు.