ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాకినాడ జిల్లాలోని అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవాలు నేటి నుంచి ఈనెల 24 వరకు కొనసాగనున్నాయి. ఇవాళ సాయంత్రం అనంతలక్ష్మీ సత్యవతీ దేవి, సత్యదేవుడిని వధూవరులను చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రేపు రాత్రి 9 గంటలకు కళ్యాణోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమం తర్వాత 10వేల మంది భక్తులకు ప్రసాదం, అక్షతలు పంపిణీ చేస్తామని ఆలయ ఈవో రామచంద్ర తెలిపారు.