మనీష్ సిసోడియా కస్టడీ మరోసారి పొడిగింపు

84చూసినవారు
మనీష్ సిసోడియా కస్టడీ మరోసారి పొడిగింపు
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు మరోసారి జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. మద్యం కుంభకోణం కేసులో మనీష్ కు జ్యూడిషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో విచారణ జరిపిన కోర్టు.. ఈ నెల 15 వ తేదీ వరకు మనీష్ సిసోడియాకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్