సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ (EC)కి ఎలక్టోరల్ బాండ్ల డేటాను SBI మంగళవారం అందించింది. ఈ డేటా సమర్పించడానికి SBI గడువు కోరగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. మార్చి 12న పనివేళలు ముగిసేలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్కు వెల్లడించాలని సోమవారం ఆదేశించింది. దీంతో పాటు ఈ డేటాను మార్చి 15 సాయంత్రం 5 గంటలలోగా వెబ్సైట్లో వెల్లడించాలని ECకి సుప్రీంకోర్టు సూచించింది.