ఢిల్లీలో పలుచోట్ల భద్రత కట్టుదిట్టం

587చూసినవారు
ఢిల్లీలో పలుచోట్ల భద్రత కట్టుదిట్టం
సీఏఏ నిబంధనల్ని కేంద్రం నోటిఫై చేయడంతో దేశ రాజధాని ఢిల్లీలోని పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈశాన్య ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌, జామియా, ఇతర సున్నిత ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. పోలీసులతో పాటు పారా మిలటరీ బలగాలను కొన్ని చోట్ల మోహరించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేక ఆందోళనల్లో 2020లో ఢిల్లీలో మతపరమైన ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్