హర్యాణాకు చెందిన సందీప్ అలియాస్ కాలాజథేడీ, రాజస్థాన్కు చెందిన అనురాధా చౌధరీ అలియాస్ మేడమ్ మింజ్లు అనేక కేసుల్లో నిందితులు. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ మార్చి 12న వివాహం చేసుకోనున్నారు. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్-3లో ఉన్న సంతోష్గార్డెన్లో ఈ వివాహం జరగనుంది. అయితే డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, సాయుధ బలగాల మోహరింపుతో కల్యాణ మండపాన్ని పోలీసులు శత్రుదుర్భేద్యంగా మార్చారు.