'సశక్త్ నారీ-విక్షిత్ భారత్' కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి అధికారంలోకి వస్తే.. మహిళా శక్తిని (ఉమెన్ పవర్) పెంచడంలో కొత్త అధ్యాయాన్ని లిఖించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక బృందాలకు (ఎస్హెచ్జీ) మోదీ బ్యాంకు రుణాలుగా సుమారు రూ.8,000 కోట్లను పంపిణీ చేశారు.