బ్రెజిల్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రియో డి జెనీరోలో ఒక మహిళ బ్యాంకు వచ్చింది. సదరు బ్యాంకు నుంచి 3వేల డాలర్లు అంటే దాదాపు రూ.2.50 లక్షల రుణం అప్లై చేసింది. షురిటీ సంతకం కోసం ఆ మహిళ చనిపోయిన వ్యక్తిని తన మామగా దత్తత తీసుకుని వీల్ చైర్లో బ్యాంకుకు తీసుకువచ్చింది. ఆ వ్యక్తి సజీవంగా ఉన్నాడని ప్రజలు భావించేలా ప్రవర్తించింది. చివరకి మోసం బట్టబయలు కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.