మణిపూర్లో లోక్సభ ఎన్నికల తొలి విడతలో భాగంగా ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మణిపూర్లోని తమన్పోక్కి పోలింగ్ కేంద్ర వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లను ఈ కాల్పులు భయాందోళనకు గురి చేశాయి. కాల్పుల శబ్దం మధ్య పోలింగ్ బూత్ నుంచి ప్రజలు బయటకు పరుగులు తీసిన వీడియో ఎక్స్ లో వైరల్ అవుతుంది.