లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, కేంద్ర మాజీమంత్రి మురళీ మనోహర్ జోషి ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ ఎన్నికల సంఘం వెల్లడించింది.