బిహార్లో భారీ వర్షాలకు ఇటీవల వంతెనలు కుప్పకూలుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 15 రోజుల వ్యవధిలోనే ఏడు బ్రిడ్జిలు కూలిపోయాయి. తాజాగా గండక్ నదిపై ఉన్న ఓ వంతెన కుప్పకూలిపోయింది. ఇదే కాక, ఇటీవల కిషన్గంజ్ జిల్లాలో కంకయీ ఉపనదిపై నిర్మించిన ఓ వంతెన, అంతకుముందు తూర్పు చంపారన్, సివాన్, అరారియా జిల్లాల్లో వంతెన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇలా పదిహేను రోజుల వ్యవధిలోనే వరుసగా ఏడు ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.