'ఎమర్జెన్సీ' సినిమా ప్రదర్శనను తెలంగాణలో నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్న షబ్బీర్ అలీ

57చూసినవారు
'ఎమర్జెన్సీ' సినిమా ప్రదర్శనను తెలంగాణలో నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్న షబ్బీర్ అలీ
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన 'ఎమర్జెన్సీ' ప్రదర్శనను తెలంగాణలో నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. దీనిపై న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ చిత్ర పదర్శనపై నిషేధం కోరుతూ తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధుల బృందం గురువారం షబ్బీర్ అలీని కలిసింది. సినిమాలో సిక్కు సమాజాన్ని ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్