త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ థాక్రేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే శివసేన యుబిటి ప్రతిపాదనను ఎన్సిపి (ఎస్పి) అధినేత శరద్ పవార్ తిరస్కరించారు. దీనిపై ముంబైలో శనివారం మీడియాతో మాట్లాడారు. మహా వికాస్ అఘాడీ కూటమి సంకీర్ణానికి ప్రాతినిథ్యం వహిస్తోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని శివసేన యుబిటి ప్రతిపాదనను ఒప్పుకోలేదన్నారు. సమిష్టి నాయకత్వమే తమ ఫార్ములా అన్నారు.