బీజేపీ అభ్యర్థిగా ‘సందేశ్‌ఖాలీ’ బాధితురాలు

79చూసినవారు
బీజేపీ అభ్యర్థిగా ‘సందేశ్‌ఖాలీ’ బాధితురాలు
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ గ్రామం ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. TMCకి చెందిన షాజహాన్ షేక్, అతడి అనుచరులు.. మహిళలపై ఆకృత్యాలకు పాల్పడటమే గాక, వారి భూములను బలవంతంగా లాక్కొన్నట్లు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. షాజహాన్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన రేఖా పత్రాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆమె బసిర్‌హట్ లోక్‌సభ నుంచి పోటీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్