పంజాబ్లోని మోగా జిల్లాలో హోలీ పండుగ వేళ దారుణం జరిగింది. స్థానికంగా నిర్వహించిన హోలీ వేడుకల్లో శివసేన నాయకుడు మంగత్ రాయ్ మంగా పాల్గొన్నారు. ఆ సమయంలో శివసేన నాయకుడు మంగత్ రాయ్ మంగాను గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.