వధువు విషయంలో మ్యాట్రిమొనీకి షాక్.. వ్యక్తికి రూ.25వేల పరిహారం

60చూసినవారు
వధువు విషయంలో మ్యాట్రిమొనీకి షాక్.. వ్యక్తికి రూ.25వేల పరిహారం
వధువును వెతకడంలో కేరళ మ్యాట్రిమొనీ సంస్థ విఫలమైందంటూ ఓ వ్యక్తి వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. దాంతో ఆ సైట్‌ను బాధ్యులను చేస్తూ జరిమానా విధించింది. ఈ ఘటన ఎర్నాకులంలో జరిగింది. 2019 జనవరిలో తాను ఫీజు చెల్లిస్తే నెలలు గడిచినా సంస్థ స్పందించలేదని బాధితుడు తెలిపాడు. బాధితుడికి మ్యాట్రిమొనీ సరైన సేవలు అందించలేదని న్యాయమూర్తి గుర్తించారు. అతను చెల్లించిన రూ. 4,100+వడ్డీ, పరిహారంగా రూ.25,000, ఖర్చుల కింద రూ.3,000 ఇవ్వాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్