ఉత్తరప్రదేశ్లోని హమీర్పుర్ జిల్లా సదర్ గ్రామానికి చెందిన మతాదిన్ రక్వార్ భార్య అనిత (33) బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతోంది. జలంధర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. దీంతో అనిత మృతదేహాన్ని భర్త అంబులెన్స్లో గ్రామానికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో లేచి కూర్చుని నీరు తాకింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆమెను చూసేందుకు వస్తున్నారు.