షాకింగ్.. డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి

58చూసినవారు
షాకింగ్.. డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి
డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో జరిగిన వివాహానికి మూడేళ్ల బాలుడు ఖుశాంత్ సాహు తన కుటుంబంతో కలిసివెళ్లాడు. వివాహ వేడుకలో స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం నిర్వాహకులు డ్రై ఐస్‌ను ఉపయోగించారు. అయితే ఐస్‌గా భావించిన బాలుడు దానిని తిని అస్వస్థతకు గురవడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్