వరికి రూ. 500 బోనస్ ఎప్పుడిస్తారు

63చూసినవారు
ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తామంటూ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలోని రైతులు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇప్పటికే సాగు నీళ్ళు కరువై పంటలు ఎండిపోతున్నాయన్నారు. కనీసం బోనస్ తో అయినా ఊరట లభిస్తుందనుకున్న తమకు నిరాశే మిగులుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్