హుస్నాబాద్ లో కనువిందు చేసిన ఇంద్రధనస్సు

81చూసినవారు
హుస్నాబాద్ లో కనువిందు చేసిన ఇంద్రధనస్సు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ వ్యవసాయ శివారులో ఆదివారం ఏర్పడిన ఇంద్రధనస్సు కనువిందు చేసింది. మండలంలోని పలు గ్రామాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. అనంతరం ఆకాశం నుంచి పొలాలను తాకేల హరివిల్లు దర్శనమిచ్చింది. సుమారు 20 నిమిషాల పాటు ఉన్న ఇంద్రధనస్సు సుందర దృశ్యాన్ని పలువురు తమ చరవాణిలో బంధించి స్టేటస్ లు పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్