తూప్రాన్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో గత నెల 11న జరిగిన హజీ పాషా (44) హత్య చేసును పోలీసులు ఛేదించారు. పాషాను హత్య చేసిన భార్య సైదా బేగం, కూతురు మెహెక్ బేగం, అల్లుడు పాషాను అరెస్టు చేసినట్లు తూప్రాన్ సీఐ కృష్ణ తెలిపారు. సైదా బేగం మొదటి భర్త కూతురైన మెహెక్ బేగంను వేధించడంతో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు వివరించారు. విచారణ జరిపి ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు