గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ములుగు మండల పరిధిలోని వంటిమామిడిలో శుక్రవారం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డుపై పడి ఉన్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలుగా ఉంటుందని, మృతదేహాన్ని గజ్వేల్ మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. ఎవరికైన మృతుడి వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచించారు.