నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంగళవారం మహిళలు గొడవకు దిగారు. డిపో నుంచి మేడారం జాతరకు బస్సులు వెళ్లడంతో బస్సుల కొరత ఏర్పడింది. దీంతో బస్సుల్లో రద్దీ తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో మహిళలు సీట్ల కోసం ఒకరినొకరు దూషించుకుని కొట్లాడుకున్నారు.