వైశాఖమాసం అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి(జూన్ 2) అంటారు. దక్షయజ్ఞం సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అగ్నికి ఆహుతి అయిపోతుంది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి భద్రకాళిని సృష్టించాడు. దుష్టసంహారం చేసే ఈ భద్రకాళి రాక్షసులకు ఉగ్రరూపిణి అయినా భక్తులపట్ల శాంతమూర్తే. భద్రకాళి కూడా ఇదే రోజు అవతరించిందని చెబుతారు. అందుకే భద్రకాళి పూజ చేస్తారు.