మల్యాల మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా పోచమ్మ వాడ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద భారీ ఈదురు గాలులు లేవగా విద్యుత్ తీగలు తెగి కింద పడగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు పరుగులు తీశారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులకు సమాచారం వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టారు.