96 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

60చూసినవారు
96 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
జిల్లాలో గురువారం పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్ బృందం నిర్వహించిన తనిఖీలలో 96 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం నిల్వలు పట్టుకున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ గురువారం తెలిపారు. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి రేషన్ దుకాణం, ఐతరాజ్ పల్లి ఓపెన్ ఏరియాలో సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. గట్టెపల్లిలోని రేషన్ షాపు తనిఖీచేసినప్పుడు 52. 5 క్వింటాళ్ల, ఐతరాజ్ పల్లి వద్ద 43. 5 క్వింటాళ్ల బియ్యం గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్