వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

55చూసినవారు
వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్
వేములవాడ పట్టణంలో బ్రిడ్జి ఆవరణలో గల అమరవీరుల స్తూపం దగ్గర సోమవారం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో తోడ్పాటును అందించిన మహా నేత డాక్టర్ వైయస్ ఆర్ అని అన్నారు.

సంబంధిత పోస్ట్