రాజన్న సిరిసిల్ల వేములవాడ పట్టణంలోని 12వ వార్డులో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో వార్డు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.