వడదెబ్బకు ఆరుగురు హోంగార్డులు మృతి

568చూసినవారు
వడదెబ్బకు ఆరుగురు హోంగార్డులు మృతి
యూపీలో విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్ 1న చివరి దశ పోలింగ్‌కు ముందు మీర్జాపూర్‌లో విషాద ఘటన జరిగింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఆరుగురు హోం గార్డులు వడదెబ్బ కారణంగా చనిపోయారు. పెద్ద సంఖ్యలో ఎన్నికల విధుల్లో ఉన్న హోంగార్డుల ఆరోగ్యం క్షీణించింది. ఆసుపత్రికి తరలించగా ఆరుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మంది హోంగార్డులను ట్రామా సెంటర్‌లో చేర్చారు.

సంబంధిత పోస్ట్