అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న విసయం తెలిసిందే. ఈ ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నౌకలోని భారతీయ సిబ్బంది క్షేమమని, ఒకరికి స్వల్పంగా గాయాలయ్యాయని షిప్ మేనేజ్మెంట్ కంపెనీ సినర్జీ ప్రకటించింది. అందులో 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. మరణించారని భావిస్తున్న వారంతా వంతెనపై గుంతలు పూడుస్తున్నారని ఓ అధికారి తెలిపారు.