కర్ణాటకకు చెందిన ఏఎన్ఐ రిపోర్టర్ పీటీఐ మహిళా జర్నలిస్టును చెంపపై కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పీటీఐతో పాటు పలు జర్నలిస్టు సంఘాలు ఏఎన్ఐకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాయి. ఈ ఘటనపై ఏఎన్ఐ రిపోర్టర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పీటీఐ వెల్లడించింది.