టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో అద్భుతమైన సెంచరీతో చెలరేగారు. దీంతో మంధాన అంతర్జాతీయ క్రికెట్లో 7వేల పరుగులు పూర్తి చేసుకున్నారు. దీంతో మిథాలీ రాజ్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్గా ఆమె నిలిచారు. మిథాలీ అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేలకు పైగా పరుగులు చేశారు.