బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చేతనైతే ఎవరైనా విగ్రహం మీద చేయి వేసి చూడాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా, పొగరు తగ్గలేదని ధ్వజమెత్తారు. విచక్షణ కోల్పోయి అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడితే, తెలంగాణ సమాజం సామాజిక బహిష్కరణ చేస్తుందని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు.