త్వరలో పోలీసు యంత్రాంగం ప్రక్షాళన.. చంద్రబాబు స్పష్టం

72చూసినవారు
త్వరలో పోలీసు యంత్రాంగం ప్రక్షాళన.. చంద్రబాబు స్పష్టం
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు. బాపట్ల జిల్లాలో యువతి హత్య ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని డీజీపీ.. సీఎంకు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. త్వరలోనే పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన ఉంటుందని డీజీపీకి స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని చంద్రబాబు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్