టీ20 మహిళల సిరీస్లో భాగంగా భారత్తో తొలి పోరులో దక్షిణాఫ్రికా బ్యాటర్లు దూకుడు ప్రదర్శించారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు సాధించింది. ఓపెనర్ తజ్మిన్(81), మారిజన్నె(57) అర్ధశతకాలతో చెలరేగిపోయారు. లారా(33), ట్రయాన్(12) రాణించారు. భారత బౌలర్లలో రాధా యాదవ్, పూజ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. గెలుపు కోసం భారతజట్టు 190 పరుగులు చేయాలి.