జూన్ 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు

84చూసినవారు
జూన్ 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
వచ్చే నెల 5 నుంచి 11వ తేదీ మధ్య రాష్ట్రాన్ని నైరుతు రుతుపవనాలు తాకనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉండటంతోపాటు ఈ నెలాఖరునే కేరళను తాకనున్నట్లు వివరించింది. అక్కడి నుంచి రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోవడానికి కనీసం ఐదారు రోజుల సమయం పడుతుందని చెప్పింది. మహాసముద్రాల ఉపరిత ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల్నీ సానుకూలంగా ఉండటంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్