అయోధ్య రామాలయంలోని పూజారుల డ్రెస్ కోడ్లో తీర్థ క్షేత్ర ట్రస్ట్ మార్పులు తీసుకొచ్చింది. ఇకపై పూజారులు తప్పనిసరిగా పసుపు రంగు తలపాగా, కుర్తా, ధోతీలను ధరించాలని తెలిపింది. గతంలో కొందరు కాషాయ రంగు, పసుపు రంగు దుస్తులు ధరించేవారు. వారిలో సారూప్యం తీసుకొచ్చేందుకు ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, గర్భాలయం లోపలికి పూజారులు స్మార్ట్ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధించింది.