ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాం: మంత్రి సీతక్క

61చూసినవారు
ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాం: మంత్రి సీతక్క
ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఆదివారం సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆదర్శనగర్, కాపువాడ, ఇస్గాం విలేజ్ నెంబర్ 12 లో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు. రూ.1 కోటి 56 లక్షల నిధులతో ప్రైమరీ హెల్త్ సెంటర్లు. రూ.40 లక్షలతో 2 సబ్ హెల్త్ సెంటర్లను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్