ఇప్పటికే ఆర్థికంగా పీకల్లోతు చిక్కుల్లో ఉన్న స్పైస్జెట్ విమానయాన సంస్థకు మరో సమస్య వచ్చి పడింది. ఆ కంపెనీ రెండున్నరేళ్లుగా ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ జమ చేయడం లేదు. సీఎన్బీసీ-టీవీ18 కథనం ప్రకారం.. 11,581మంది ఉద్యోగులకు చివరిగా 2022 జనవరిలో పీఎఫ్ డిపాజిట్ చేసింది. దీనిపై ఈఫీఎఫ్ఓ నోటీసులు జారీ చేయగా, సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది.