రైలు జనరల్ బోగీలో ప్రయాణం ఎప్పుడు నరకమే. తాజాగా ఓ రైలులో ప్రయాణికుడు రెస్ట్రూమ్కు వెళ్లేందుకు ఎంచుకున్న మార్గం వామ్మో అనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. నడవడానికి కనీసం దారి కూడా లేకపోవడంతో ఓ వ్యక్తి సీట్లపై నుంచి తోటి ప్రయాణికుల తలల మీదుగా బ్యాలెన్స్ చేసుకుంటూ రెస్ట్రూమ్కు వెళ్లాడు. అతడు వెళ్లిన విధానం స్పైడర్ మ్యాన్ను గుర్తుకు తెస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.