బుల్లెట్ కంటే వేగంతో బంతులు వేస్తూ.. బ్యాటర్లను బెంబేలెత్తించిన LSG బౌలర్ మయాంక్ యాదవ్ మిగతా మ్యాచ్లకు దూరం కానున్నట్లు సమాచార. పొత్తికడుపులో నొప్పితో ఇటీవల కొన్ని మ్యాచ్లకు దూరమైన ఈ యంగ్ బౌలర్ నిన్న MIతో మ్యాచ్లో రీఎంట్రీ ఇచ్చారు. కానీ 3.1ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి అర్ధాంతరంగా మైదానాన్ని వీడారు. గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఐపీఎల్లో 155.8 కి.మీ స్పీడుతో యాదవ్ అత్యంత వేగవంతమైన బంతిని విసిరారు.