న్యూయార్క్లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గురించి అందరికీ తెలిసిందే. ఆ విగ్రహం భారత్లో కూడా ఉంది. పంజాబ్లోని టార్న్ తరన్ ప్రాంతంలోని భవనంపై స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతి రూపాన్ని భవన యజమాని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోని ప్రజలు సృజనాత్మకంగా ఉంటున్నారు. ఇంటి పైకప్పుపై క్రూయిజ్ షిప్లు, భారీ ఆల్కహాల్ బాటిళ్లు, బాడీ బిల్డర్ల ప్రతి రూపాలు ఉన్నాయి. ఇక స్టాట్యూ ఆఫ్ లిబర్డీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.