ఆర్సీబీ టైటిల్ రేసుపై స్టీవ్ స్మిత్ కీలక వ్యాఖ్యలు

52చూసినవారు
ఆర్సీబీ టైటిల్ రేసుపై స్టీవ్ స్మిత్ కీలక వ్యాఖ్యలు
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అత్యుత్తమంగా రాణిస్తున్నారని ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ అన్నారు. ‘కోహ్లీ ఒక్కడే రాణిస్తే ఫలితం లేదు. మిగతా ఆటగాళ్ల నుంచి అతడికి సహకారం కావాలి. జట్టులోని ఇతర ఆటగాళ్లు విఫలమవుతుంటే అతడిపై ఒత్తిడి పెరుగుతోంది. అన్ని మ్యాచ్‌ల్లోనూ కోహ్లీపై ఆధారపడడం తగదు. ఆటగాళ్లందరూ సమష్ఠిగా రాణిస్తేనే ఆర్సీబీ టైటిల్ రేసులో ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్