దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 404 పాయింట్ల నష్టంతో 72,260 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 105 పాయింట్లు కుంగి 21,949 దగ్గర కొనసాగుతోంది. సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, TCS, HUL, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, JSW స్టీల్, మారుతీ, టాటా స్టీల్, SBI, NTPC, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.