వినాయక నిమజ్జన ఊరేగింపులో వైసీపీ పాటలు.. కేసు నమోదు (వీడియో)

81చూసినవారు
వినాయక నిమజ్జన ఊరేగింపులో వైసీపీ పాటలు వేయడంపై అన్నమయ్య జిల్లా బి.కొత్తపేటలో కేసు నమోదైంది. ఈ నెల 13న పోకనాటి వీధి వినాయకుడి ఊరేగింపు ప్రారంభమైన కాసేపటికే డీజే బాక్సుల్లో జగన్ పాటలు రావడంతో కొందరు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాటలు పెట్టి రెచ్చగొట్టారని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు నిమజ్జన కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్