ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరగనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. అలాగే జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా రఘురామ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై ధర్మాసనం విచారించనుంది.