భార్యను కాపురానికి పంపట్లేదని మామపై యాసిడ్ దాడి

581చూసినవారు
భార్యను కాపురానికి పంపట్లేదని మామపై యాసిడ్ దాడి
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో దారుణం చోటు చేసుకుంది. మామ నాగేశ్వరరావుపై అల్లుడు యాసిడ్‌తో దాడి చేశాడు. తన భార్యను కాపురానికి పంపకపోవడం వల్లే అల్లుడు ఈ ఘాతకానికి పాల్పడినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మామ నాగేశ్వరరావు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్