దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 484 పాయింట్లు లాభపడి 74,361 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 144 పాయింట్లు పెరిగి 22,579 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.44 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్-30 సూచీలో HDFC బ్యాంక్, పవర్గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, JSW స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.