లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

73చూసినవారు
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 484 పాయింట్లు లాభపడి 74,361 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 144 పాయింట్లు పెరిగి 22,579 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.44 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌-30 సూచీలో HDFC బ్యాంక్, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, JSW స్టీల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్