దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 22,055 వద్దకు చేరింది. సెన్సెక్స్ 104 పాయింట్లు దిగజారి 72,748 వద్దకు చేరింది. టాటా స్టీల్, ఎంఅండ్ఎం, JSW స్టీల్, టాటా మోటార్స్, మారుతి సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. TCS, ఇన్ఫోసిస్, టైటాన్, విప్రో, HUL, నెస్లే, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.