దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 124 పాయింట్లు నష్టపోయి 22,147 వద్దకు చేరింది. సెన్సెక్స్ 455 పాయింట్లు దిగజారి 72,943 వద్దకు చేరింది. టైటాన్, HDFC బ్యాంక్, HUL, మారుతీ సుజుకీ మినహా మిగతా కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు భారీగా నష్టపోయాయి.